బాల విశ్వసుందరి పోటీలకు మన అందాల బాలిక(పిక్చర్స్)
బాల విశ్వసుందరి పోటీలకు 12 ఏండ్ల ఒడియా బాలిక పద్మాలయ నందా ఎంపికైంది. మే 31 నుంచి జూన్ 6 వరకు అమెరికాలోని జార్జియాలో లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలు జరుగనున్నాయి.
న్యూఢిల్లీ: బాల విశ్వసుందరి పోటీలకు 12ఏళ్ల ఒడియా బాలిక పద్మాలయ నందా ఎంపికైంది. మే 31 నుంచి జూన్ 6 వరకు అమెరికాలోని జార్జియాలో లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలు జరుగనున్నాయి.
Bhubaneswar: Odia girl Padmalaya Nanda to represent India at 'Little Miss Universe 2017' beauty pageant, in Batumi, Georgia pic.twitter.com/xq9cSVQnEH
— ANI (@ANI_news) May 27, 2017
ఆ 16మందిలో పద్మాలయ ఒకరు
ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 16 మందిలో పద్మాలయ నందా ఒకరు. కటక్లోని స్టువర్ట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక ఈ పోటీలకు భారత్ తరపున నామినేట్ అయింది.
లిటల్ మిస్ కిరీటం
గ్రీస్లో జరిగే లిటిల్ మిస్వరల్డ్ పోటీల్లో ఈ చిన్నారి దేశం తరఫున ప్రాతినిథ్యం వహించనుంది. ఇటీవల కేరళలోని కోజికోడ్లో జరిగిన జూనియర్ మోడల్ అంతర్జాతీయ పోటీల్లో బాలిక లిటిల్ మిస్ కిరీటం గెలుచుకుంది.
23ఏళ్ల తర్వాత
మనీలాలో 23ఏళ్ల క్రితం జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన సుస్మితా సేన్ తర్వాత మరోసారి భారత తరపున పద్మాలయ నంద చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విజేత అవడానికి వందశాతం
‘ఈ బ్యూటీ పీజంట్ కోసం వెళుతున్న నాకు ప్రజల మద్దతు ఆశీస్సులు నాకుంటాయని భావిస్తున్నా. నేను విజేతంగా నిలిచేందుకు వందశాతం ప్రయత్నిస్తా. మన సాంప్రదాయాన్ని ప్రామోట్ చేస్తా. ప్రజల మద్దతు ఉంటే నేను తప్పకుండా విజయం సాధిస్తా' అని పద్మాలయ నంద తెలిపింది.