వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నది అడుగు భాగాన.. 300 ఏళ్ల నాటి భారీ గుప్తనిధి

దాదాపు 300 ఏళ్ల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: దాదాపు 300 ఏళ్ల క్రితం నీటిపాలైన అపార సంపదను చైనా పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిధిలో 10 వేలకు పైగా వెండి, బంగారు వస్తువులున్నాయని వారు పేర్కొన్నారు.

నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ సమీపంలోని నదిలో ఈ నిధిని గుర్తించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో ఎక్కువగా నాణేలు, నగలు ఉన్నాయని, వీటితోపాటు కంచు, ఇనుముతో చేసిన కొన్ని ఆయుధాలు కూడా ఉన్నట్లు చెప్పారు.

Chinese archaeologists discover huge underwater treasure

మిన్ జియాంగ్ నదికి ఉపనదిగా పిలిచే జిన్ జియాంగ్ నదీ గర్భంలో ఈ సంపద బయటపడినట్లు సిచువాన్ ప్రావిన్షియల్ కల్చరల్ రెలిక్స్ అండ్ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గావో డాలన్ వెల్లడించారు.

1646లో ఆ ప్రాంతాన్ని పాలించిన ఝాంగ్ జియాంఝాంగ్.. మింగ్ సైన్యానికి భయపడి సంపదను వెయ్యి పడవల్లో మరో చోటుకు తరలిస్తుండగా అందులో కొన్ని పడవలు నదిలో మునిగిపోయాయని, ఆ సంపదే ఇప్పుడు బయటపడిందని చెప్పారు.

సాధారణంగా వేసవి సమీపించడంతో నదీ పరిసర ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలను ప్రారంభిస్తారు. ఈ ఏడాది కూడా మొదలు పెట్టడంతో ఈ నిధి బయటపడింది.

English summary
Chinese archaeologists on Monday said that they have recovered more than 10,000 gold and silver items that sank to the bottom of a river in southwestern Sichuan Province over 300 years ago. The items included a large amount of gold, silver and bronze coins and jewellery as well as iron weapons such as swords, knifes and spears, said Gao Dalun, director of Sichuan Provincial Cultural Relics and Archaeology Research Institute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X