రికార్డ్: 2014ఫీట్ల జాతీయ జెండా ప్రదర్శన(పిక్చర్స్)
హైదరాబాద్: 68వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని ట్యాండ్బండ్పై గురువారం 2014 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. దిల్సుఖ్నగర్లోని లోటస్ ల్యాప్ విద్యా సంస్థల డైరెక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ భారీ జాతీయ జెండాను రూపొందించారు. దీనిని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు.
2010లో 1,947 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించి రికార్డు నెలకొల్పిన విద్యార్థులు, ఇప్పుడు 2,014 అడుగుల జెండాను ప్రదర్శించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఇండియాలో చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ స్వర్ణశ్రీ రికార్డు నమోదు చేసి సర్టిఫికెట్లను అందజేశారు.
కాగా, పలువురు విద్యార్థినీ విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో జాతీయ జెండాలను చేత పట్టుకుని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ ఉపాసకుడు దైవజ్ఞ శర్మ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, లోటస్ ల్యాప్ విద్యా సంస్థల డైరెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కో-ప్రిన్సిపాల్ డివి రమణ, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండా
68వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని ట్యాండ్బండ్పై గురువారం 2014 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.
జాతీయ జెండా
దిల్సుఖ్నగర్లోని లోటస్ ల్యాప్ విద్యా సంస్థల డైరెక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ భారీ జాతీయ జెండాను రూపొందించారు.
జాతీయ జెండా
ట్యాండ్బండ్పై గురువారం 2014 అడుగుల జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు.
జాతీయ జెండా
పలువురు విద్యార్థినీ విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో జాతీయ జెండాలను చేత పట్టుకుని ఆకట్టుకున్నారు.
జాతీయ జెండా
ఈ భారీ జాతీయ జెండాను తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు.
జాతీయ జెండా
2010లో 1,947 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించి రికార్డు నెలకొల్పిన విద్యార్థులు, ఇప్పుడు 2,014 అడుగుల జెండాను ప్రదర్శించారు
జాతీయ జెండా
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సౌత్ ఇండియాలో చీఫ్ కో-ఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ చీఫ్ కో-ఆర్డినేటర్ స్వర్ణశ్రీ రికార్డు నమోదు చేసి సర్టిఫికెట్లను అందజేశారు.
జాతీయ జెండా
ఈ కార్యక్రమంలో సరస్వతీ ఉపాసకుడు దైవజ్ఞ శర్మ, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, లోటస్ ల్యాప్ విద్యా సంస్థల డైరెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కో-ప్రిన్సిపాల్ డివి రమణ, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండా
పలువురు విద్యార్థినీ విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో జాతీయ జెండాలను చేత పట్టుకుని ఆకట్టుకున్నారు.