బతుకమ్మలను మోసిన జ్వాలా, కవిత, పద్మా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ హైదరాబాదులో గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాదులోని ట్యాంక్బండ్పై బతుకమ్మ సోయగాలు విప్పారాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దంపతులు, గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు ట్యాంక్బండ్ వరకు సాగింది. వేలాది మంది మహిళలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పండుగగా నిర్వహించింది.
బతుకమ్మలను గురువారం రాత్రి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు. ఆ తర్వాత హుస్సేన్ సాగర్లోని వృధాను హైదరాబాద్ నగరపాలక సంస్థ కార్మికులు తోడేయడం ప్రారంభించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత కూడా ఇలాగే తోడేశారు.
బతుకమ్మ వేడుకల్లో..
ట్యాంక్బండ్పై జరిగన వేడుకల్లో గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, ముఖ్యమంత్రి సతీమణి శోభ కూడా బతుకమ్మ ఆడారు.
అంగరంగ వైభవంగా..
గురువారం సాయంత్రం ట్యాంక్బండ్పై బతుకమ్మ ఊరేగింపు చేరుకుంది. వేలాది మంది మహిళలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.
నిమజ్జనం కోసం..
బతుకమ్మ ఆడిన తర్వాత చెరువులో వాటిని నిమజ్జనం చేయడం సంప్రదాయం. మహిళలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి తీసుకుని వెళ్తూ..
కవిత, పద్మా దేవేందర్ రెడ్డి..
బతుకమ్మ ఊరేగింపులో పాల్గొన్న ఎంపి కల్వకుంట్ల కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తమ బతుకమ్మలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు.
ఇలా తోడేస్తూ...
బతుకమ్మలను నిమజ్జనం చేయడంతో హుస్సేన్ సాగర్లో పేరుకుపోయిన వృధాను తొలగిస్తున్న ఎంసిహెచ్ కార్మికులు
పూలను తోడేసి..
బతుకమ్మల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్లో నిండిపోయిన రంగు రంగుల పూవులను ఎంసిహెచ్ కార్మికులు తోడేశారు.
జ్వాలా గుత్తా...
బతుకమ్మను ఎత్తుకున్న ప్రముఖ క్రీడాకారిణి జ్వాలా గుత్తా తన బతుకమ్మను ఇలా నిమజ్జనం చేయడానికి తీసుకుని వెళ్తూ..