శ్రీవారి సేవలో నాగార్జున: నుదుట తిలకం పెట్టారు
హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అ్ననారు. ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఐదో రోజు ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణలతో మారుమోగాయి. ఉదయం ఆరు గంటలకు జయ విజయుల సమక్షంలో అర్చకులంతా ముక్తకంఠంతో సుప్రభాతం ఆలపించి స్వామివారిని మేలుకొలిపారు. తోమాలసేవ, కొలువు, ఆర్చన, నివేదన, శాత్తుమొర పూజలు చేపట్టారు.
తిరుమల వెంకన్నను అలంకరించే నిజపుష్పాలతో ఇక్కడి విగ్రహానికి అలంకరించని సర్వదర్శన భాగ్యం కలిగించారు. వందల మంది భక్తులు సుప్రభాతసేవలో పాల్గొన్నారు. సాయంత్రం సహస్రదీపాల కాంతులతో స్వామివారు వెలిగిపోయారు. ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించించారు.
వాయిద్యాలు మోగుతుండగా, కాగడాలతో సేవకులు కదులుతుండగా, భక్తులు ఇరువైపులా ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామి పల్లకిలో ఊరేగారు. పల్లకిని ముట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. సాధారణంగా తిరుపతికి వెళ్లిన భక్తులు సైతం లభించని స్వామివారి పవళింపు సేవ ఇక్కడ తిలకించే భాగ్యం కలిగింది.
స్వామివారి దర్శనం కాగానే తిరుపతి ప్రసాదాలు అందించారు. గోశాలలో గోవులకు సేవ చేశారు. తిరుమల తిరుపతి పాత కొత్త చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రదర్శనను భక్తులు తిలకించారు. బుధవారం సాయంత్రం స్వామివారి సేవలో కేంద్రమంత్రి జేపీ నడ్డాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
వీరితో పాటు సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మంచు విష్ణు, ప్రముఖ సంగీత విద్యాంసురాలు శోభారాజు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులు, నేతలు పేరాల చంద్రశేఖర్ తదితర ప్రముఖలు హాజరయ్యారు.
శ్రీవారి సేవలో నాగార్జున
ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అ్ననారు.
శ్రీవారి సేవలో నాగార్జున
ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఐదో రోజు ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
శ్రీవారి సేవలో నాగార్జున
ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణలతో మారుమోగాయి. ఉదయం ఆరు గంటలకు జయ విజయుల సమక్షంలో అర్చకులంతా ముక్తకంఠంతో సుప్రభాతం ఆలపించి స్వామివారిని మేలుకొలిపారు.
శ్రీవారి సేవలో నాగార్జున
తోమాలసేవ, కొలువు, ఆర్చన, నివేదన, శాత్తుమొర పూజలు చేపట్టారు. తిరుమల వెంకన్నను అలంకరించే నిజపుష్పాలతో ఇక్కడి విగ్రహానికి అలంకరించని సర్వదర్శన భాగ్యం కలిగించారు.
శ్రీవారి సేవలో నాగార్జున
వందల మంది భక్తులు సుప్రభాతసేవలో పాల్గొన్నారు. సాయంత్రం సహస్రదీపాల కాంతులతో స్వామివారు వెలిగిపోయారు. ఉత్సవమూర్తులను మాడవీధుల్లో ఊరేగించించారు. వాయిద్యాలు మోగుతుండగా, కాగడాలతో సేవకులు కదులుతుండగా, భక్తులు ఇరువైపులా ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామి పల్లకిలో ఊరేగారు.
శ్రీవారి సేవలో నాగార్జున
పల్లకిని ముట్టుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. సాధారణంగా తిరుపతికి వెళ్లిన భక్తులు సైతం లభించని స్వామివారి పవళింపు సేవ ఇక్కడ తిలకించే భాగ్యం కలిగింది. స్వామివారి దర్శనం కాగానే తిరుపతి ప్రసాదాలు అందించారు. గోశాలలో గోవులకు సేవ చేశారు. తిరుమల తిరుపతి పాత కొత్త చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ ప్రదర్శనను భక్తులు తిలకించారు.
శ్రీవారి సేవలో నాగార్జున
బుధవారం
సాయంత్రం
స్వామివారి
సేవలో
కేంద్రమంత్రి
జేపీ
నడ్డాతో
పాటు
బీజేపీ
రాష్ట్ర
అధ్యక్షుడు,
ఎమ్మెల్యే
కిషన్
రెడ్డి
పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో నాగార్జున
వీరితో పాటు సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మంచు విష్ణు, ప్రముఖ సంగీత విద్యాంసురాలు శోభారాజు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులు, నేతలు పేరాల చంద్రశేఖర్ తదితర ప్రముఖలు హాజరయ్యారు.