ట్యాక్సీ ఆన్ మొబైల్: ఒకవైపు చెల్లిస్తే చాలు(ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టానికి చెందిన ప్రముఖ స్టార్టప్ సర్వీసుల సంస్థ యూవై టెక్నాలజీ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం ట్యాక్స్పై చాలా దూరం ప్రయాణం చేయాలంటే రాను, పోను ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
కానీ యూవై టెక్నాలజీకి చెందిన ట్యాక్సీ ఆన్ మొబైల్ సర్వీసుల ద్వారా ఒకవైపు చెల్లిస్తే సరిపోతుంది. ఈ నూతన సర్వీసులు అందించడానికి ట్యాక్స్ నిర్వహకులతో అనుసంధానం అయ్యేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ఫౌండర్ యశ్వంత్ తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని 71 నగరాల్లో ఇలాంటి సేవలు అందిస్తుండగా, భవిష్యత్తులో ఢిల్లీ, మహారాష్ట్రలకు విస్తరించేయోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
భారత్లో రోజుకు 10 లక్షల మంది ట్యాక్స్లను వినియోగిస్తున్నారని, వీరిని దృష్టిలో పెట్టుకొని ఈ నూతన సర్వీసులకు శ్రీకారం చుట్టడం జరిగిందని యశ్వంత్ తెలిపారు.