ఇక రాజధాని రోడ్లపై వోల్వో బస్సుల పరుగు(పిక్చర్స్)
హైదరాబాద్: నగర రహదారులపై ఇక వోల్వో బస్సులు పరుగులు తీయనున్నాయి. వీటి ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శనివారం నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద వీటిని అధికారికంగా ప్రారంభించనున్నారు. మెట్రో లగ్జరీ అని నామకరణం చేసిన ఈ బస్సుల్లో ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
మొదట నాలుగు రూట్లలో నడపడానికి సన్నాహాలు పూర్తిచేశారు. రెండున్నర నెలలుగా ఆర్టీసీ ముషీరాబాద్ డిపోకే పరిమితం చేసిన వోల్వో బస్సుల్లో జీపీఆర్ఎస్ సిస్టమ్తో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి నిర్వహణ కోసం డిపోలకు కేటాయించారు. వీటి నిర్వహణ కోసం డ్రైవర్లకు, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ నిచ్చారు. ఈ బస్సులో డ్రైవర్ , కండక్టర్లు ప్రత్యేక డ్రెస్సు (పూర్తిగా తెల్ల దుస్తులు) ధరిస్తారు. నగరంలో మొదటి సారిగా వోల్వో బస్సులు రోడ్డుపైకి వస్తున్నాయి.
చార్జీల వివరాలు
వోల్వో బస్సుల్లో కనీస చార్జీ రూ.15, అత్యధిక చార్జీ 50 కిలోమీటర్ల వరకు రూ.110 ఉండనుంది. యాజ్ యూ లైక్ టికెట్కు 150 రూపాయలు, ఈ టికెట్ ఎప్పుడు టికెట్ తీసుకున్నా రాత్రి 12 గంటల వరకు పుష్పక్ బస్సు మినహా అన్ని బస్సుల్లో ప్రయాణించవచ్చు. నెలకు 2000లతో తీసుకునే పాసుతో పుష్పక్ బస్సు మినహా అన్ని బస్సులో(వోల్వోతో సహా)ప్రయాణించవచ్చు.
వోల్సో బస్సులు
నగర రహదారులపై ఇక వోల్వో బస్సులు పరుగులు తీయనున్నాయి. వీటి ప్రారంభానికి ముహూర్తం కుదిరింది.
వోల్వో బస్సులు
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శనివారం నెక్లెస్రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద వీటిని అధికారికంగా ప్రారంభించనున్నారు.
వోల్వో బస్సులు
మెట్రో లగ్జరీ అని నామకరణం చేసిన ఈ బస్సుల్లో ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
వోల్వో బస్సులు
బస్సులు రోడ్డెక్కిన రోజు నుంచే ప్రయాణికులకు బస్సుల సమాచారం అందించడానికి నగరంలోని వంద సెంటర్లలో ఏర్పాటు చేసిన వెహికిల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తేవడానికి ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వోల్వో బస్సులు
గ్రేటర్ పరిధిలో మొదటి విడతలో 80 మెట్రో లగ్జరీ ఏసీ వోల్వో బస్సులను, బస్సుల సమాచారం అందించే డీటీపీఎస్ విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు.