వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా వాచ్: ఈనాడు-జ్యోతి-సాక్షి

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
చిరంజీవి సభలకు జనం తగ్గుముఖం పట్టినా ఆ రెండు పత్రికలు మాత్రం "చిరు ఇరగదీశాడు" అన్నట్టు రాస్తున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డిని గద్దె దించడానికి చిరంజీవి "చిరు" పాత్ర అయినా వహించగలడని ఆ పత్రికల ఆశ కావచ్చు. చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీపై ఆ రెండు పత్రికలు నిర్వహించిన ప్రైవేటు సర్వేలలో ఆశాజనక ఫలితాలు రానప్పటికీ వైఎస్ కు మనస్ధాపం కలిగించే ఉద్దేశంతోనే ఆ పత్రికలు వార్తా కథనాలను ప్రచురిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ప్రైవేటుగా రుస రుస లాడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి "ఆంధ్రజ్యోతి" మీద ఆక్రోశం వ్యక్తం చేయడం ఈ యుద్ధానికి పరాకాష్ట. తన మీద ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఆధార రహిత కథనాలు చదివి కలత చెందిన తన తల్లి గుండెపోటుతో మరణించిందని ఆయన చెప్పినట్టు వైఎస్ పత్రిక "సాక్షి"లో నేడు పతాక శీర్షికతో వార్త వచ్చింది. ఆ వార్త ఇతర పత్రికల్లో రాకపోవడం గమనించాల్సిన విషయం. ఈ యుద్ధంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక వైపున ఉండగా సాక్షి మరో వైపు ఉంది. "వార్త" గుంటకాడ నక్కలాగా ఎటు చేరాలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అయినా పత్రికలు చదివి ప్రభావితమై ఓట్లు వేసేవారుంటారా?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X