పార్లమెంట్ క్యాంటీన్లో హైదరాబాద్ బిర్యానీ! శిక్షణ
న్యూఢిల్లీ: హైదరాబాదులో ప్రముఖమైన వంటకం 'హైదరాబాద్ బిర్యానీ' ఇక నుండి పార్లమెంటు సభ్యులకు అందుబాటిలోకి రానుంది. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది.
ఇదిలా ఉండగా, ఇలాంటి హైదరాబాద్ బిర్యానీని పార్లమెంటు క్యాంటీన్ మెనులో చేర్చాలని పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి నిర్ణయించారు. మంగళవారం ఆయన పార్లమెంటరీ ఫుడ్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాదీ బిర్యానీతో పాటు మిర్చి కా సాలన్, షాయి తుకడా, ఖుబానీ కా మీఠా వంటి కొత్త వంటకాలను ప్రవేశ పెడతామని చెప్పారు. పార్లమెంటులోని వంట వారికి ఈ వంటకాల పైన హైదరాబాదులోని నిజాం క్లబ్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు.