బర్త్ డే రోజు కన్పించని జగన్, ఫ్యాన్స్ నిరాశ: కేక్ కట్ చేసిన రోజా (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆయన జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలు జరిపారు. కేక్ కట్ చేశారు.
ఆదివారం జగన్ 43వ బడిలోకి అడుగుపెట్టారు. నూతన రాష్ట్రంలో ఆయనకు ఇది తొలి జన్మదినం. జగన్కు శుభాకాంక్షలు చెప్పేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు లోటస్ పాండుకు తరలి వచ్చారు. అయితే, అక్కడ జగన్ లేకపోవడంతో అందరు నిరాశకు గురయ్యారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి, ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రోజాలు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. జగన్ బెంగళూరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే, జగన్ అభిమానులకు, నేతలకు కనిపించక పోవడంతో ఒకింత నిరాశకు లోనయ్యారు.
జగన్ పుట్టిన రోజు వేడుక
జగన్ 43వ జన్మదినం సందర్భంగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన విజయ సాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, రోజా తదితరులు.
జగన్ పుట్టిన రోజు వేడుక
జగన్ 43వ జన్మదినం సందర్భంగా హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న మేకపాటి, పక్కన రోజా, విజయసాయి, పొంగులేటి తదితరులు.
జగన్ పుట్టిన రోజు వేడుక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 43వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు రక్తదానం చేస్తున్న దృశ్యం.
జగన్ పుట్టిన రోజు వేడుక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 43వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారిని విజయ సాయి రెడ్డి తదితరులు పరామర్శించారు.
జగన్ పుట్టిన రోజు వేడుక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 43వ పుట్టిన రోజు సందర్భంగా దుప్పట్లు పంచుతున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి.
జగన్ పుట్టిన రోజు వేడుక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 43వ పుట్టిన రోజు సందర్భంగా టపాకాయలు కాల్చుతున్న అభిమానులు.
జగన్ పుట్టిన రోజు వేడుక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 43వ పుట్టిన రోజు సందర్భంగా టపాకాయలు కాల్చుతున్న అభిమానులు.