70 ఏళ్ల ముసలాయన ఎమ్ఎమ్ఎస్ స్కాండల్: డబ్బు లేకపోతే కిడ్నీ అడిగింది
మీరట్: కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఓ పెద్దాయనను బెదిరించిన మహిళను అరెస్టు చేశారు పోలీసులు. మీరట్ ఎస్ఎస్పీ ఓంకార్ సింగ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన ఓ 20 ఏళ్ళ యువతి హెర్బల్ సంస్థలో పనిచేస్తున్నట్లుగా చెప్పుకొని స్థానికంగా ఉంటున్న ఓ 70 ఏళ్ల పెద్దాయనను కలిసింది. ఓ ప్రముఖ బ్యాంక్లో పని చేసి ఈయన రిటైర్ అయ్యారు.
తమ సంస్థ తరపున ఇస్తున్న ప్రత్యేక క్లబ్ సభ్యత్వాన్ని తీసుకోవాలని కోరింది. దీనికి సరేనన్న ఆ పెద్దాయన సభ్యత్వం తీసుకొని క్లబ్కు వెళ్లటం మొదలుపెట్టాడు. రెండు నెలల తర్వాత ఎప్పటిలాగే క్లబ్కి వెళ్లిన ఆపెద్దాయనకి ఆమె ఓ ‘ప్రత్యేకమైన' మందు ఇచ్చింది.
అది తీసుకున్న కాసేపటికే అతడు స్పృహ కోల్పోయాడు. మెలకువ వచ్చే సరికి నగ్నంగా ఓ పరుపు మీద పడి ఉన్నాడు. మరో ఇద్దరు యువకులతో ఆమె తన ఫోన్లోని వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది.
తొలిసారిగా ఆ పెద్దాయన నుంచి రూ. ఐదు లక్షలు డబ్బులు రాబట్టింది. ఆ తర్వాత తన దగ్గర ఇక ఇవ్వటానికి ఏమీ లేదన్న పెద్దాయనతో ‘ఏమీ లేకపోవటం ఏంటి? నీ కిడ్నీ ఇవ్వు? అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో ఏమి చేయాలో తెలియని పరిస్ధితిలో ఆ పెద్దాయన పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.