వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఘోరం: పావురాలకి క్రాకర్స్ కట్టి, నిప్పు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు స్వాగతం పలికే సమయంలో... స్థానిక నాయకులు పావురాలకు తారాజువ్వలు కట్టి ఎగురవేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శాంతిని కోరుకుంటున్నామన్న దానికి నిదర్శనంగా నాయకులు కపోతాలను గాల్లోకి ఎగురవేస్తారు. కానీ, ఏపీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందుకు భిన్నంగా, పైశాచికంగా వ్యవహరించారని అంటున్నారు.

శాంతి కపోతాలకు తారాజువ్వలు కట్టి పేల్చేసి వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేశారని వార్తలు వస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో శనివారం ఈ సంఘటన జరిగింది.

కాంగ్రెస్

కాంగ్రెస్

కొవ్వూరులో కాంగ్రెస్ పార్టీ రైతు గర్జన సభ ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఈ సభకు ముఖ్య అథితిగా హాజరయ్యారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని ఆహ్వానించేందుకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు... కొత్త ఆలోచన చేశారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

రఘువీరా రెడ్డి వేదిక దగ్గరికి వస్తుండగా మూడు పావురాలకు తారాజువ్వలు కట్టి నిప్పంటించి పైకి వదిలారు. పైకి వెళ్లిన తారాజువ్వలతో పాటు పావురాలు కూడా పేలిపోయి ప్రాణాలు విడిచాయని తెలుస్తోంది. దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్

కాంగ్రెస్

రఘువీరా రెడ్డి, తదితర కాంగ్రెస్ నేతల సమక్షంలోనే ఈ దారుణం జరిగింది. కార్యకర్తలు అలా చేస్తుంటే ఎవ్వరూ వారించలేదంటున్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

అన్యాయంగా పావురాలను చంపేసినా గమనించకుండా ఏమీ జరుగలేదన్నట్లు కాంగ్రెస్ నాయకులు చిరునవ్వులు చిందిస్తూ వేదిక వద్దకు చేరుకోవడం ఆశ్చర్యకరమని అంటున్నారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలకు స్వాగతం పలికే సమయంలో... స్థానిక నాయకులు పావురాలకు తారాజువ్వలు కట్టి ఎగురవేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

English summary
Controversy in Andhra Pradesh Congress Party meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X