వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5గురు పిల్లల్ని కంటే రూ.2 లక్షల రివార్డు: శివసేన

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆగ్రా శివసేన యూనిట్ శనివారం నాడు ఓ ప్రకటన చేసింది. హిందూ కుటుంబ సభ్యులు ఐదుగురు పిల్లలను కంటే వారికి రూ.2 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించింది.

దేశంలో కులాల వారీగా ఇటీవల ప్రకటించిన జాబితాలో హిందువుల సంఖ్య తగ్గడంపై శివసేన ఆగ్రా యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ సంఖ్య పెంచేందుకు తమవంతు ప్రయత్నం ప్రారంభించింది. ఐదుగురు పిల్లలున్న ప్రతి ఇంటికీ రూ.2 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించింది.

Every Hindu family with five children will get Rs 2 lakh: Shiv Sena

హిందువుల సంఖ్య తగ్గినందువల్లే ఈ బహుమతిని ప్ర్రవేశపెట్టామని శివసేన జిల్లా చీఫ్ వీను లావానియా చెప్పారు. అంటే 2010-15 మధ్య ఐదుగురు పిల్లలు కలిగిన కుటుంబాలకు, ఇప్పుడు కనబోయే ప్రతి కుటుంబానికి రెండు లక్షల నగదు బహుమతి అందజేస్తారు.

బహుమతి కోసం సదరు తల్లిదండ్రులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పొందిన జనన ధ్రువీకరణ పత్రం పొందుపర్చాలన్నారు. ముస్లిం జనాభా పెరుగుతుండటంపై కూడా శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. వారు ఏకరూప పౌర కోడ్‌కు కట్టుబడాలని, బహుభార్యాత్వం వ్యవస్థను వెంటనే రద్దు చేయాలన్నారు.

English summary
The Agra unit of the Shiv Sena has announced a reward of Rs 2 lakh for every Hindu family which has five children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X