మగబిడ్డ పుడ్తాడంటూ బాబా రామ్దేవ్ బీజం
న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్పై మరోసారి వివాదం చెలరేగింది. బాబా రాందేవ్ పతంజలి ఫార్మసీ ద్వారా లభిస్తున్న ‘దివ్య పుత్రజీవక్ సీడ్' మందును వాడితే మగ బిడ్డలు పుట్టడం ఖాయమనే ప్రచారం దేశవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.
ఈ మందుతో సంతాన సమస్యలు తొలగి, పండంటి మగబిడ్డ పుడతాడని రాందేవ్ నుంచి సందేశం వచ్చిందని రాందేవ్ మెడికల్ స్టోర్లో పనిచేస్తున్న డాక్టర్ శ్యాంసుందర్ తెలిపారు. ఈ మందు వల్లే తమకు మగబిడ్డ పుట్టాడని కొంతమంది వ్యక్తులు ఇతరులకు చెబుతున్నారన్నారు. తద్వారా దానికి మార్కెట్ పెంచుతున్నారని అంటున్నారు.
పతంజలి మందుల దుకాణాల ద్వారా లభించే ఈ సహజసిద్ధ ఔషధం ప్యాకెట్ ధర రూ. 35 లేనట. హర్యానాలో ఈ మందుకు ఫుల్లుగా గిరాకీ ఉందట. ఆ రాష్ట్రానికి పంపిన మందు మొత్తం ఇప్పటికే సేల్ అదిరిపోతుందట. అయితే, ఆ మందు సంతానయోగ్యతను కలిగిస్తుందని, మగబిడ్డ మాత్రమే పుడుతాడని గ్యారంటీ ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తోంది.
అయితే, దాని పేరు వల్ల మగబిడ్డ పుడుతాడనే ప్రచారం సాగుతోందని అంటున్నారు. ప్రధాని మోడీ ఇటీవల బేటీ బచావో, బేటీ పఢావో నినాదం ఇచ్చారు. హర్యానాలో మగపిల్లలు తగ్గిపోతుండడంతో అక్కడ రామ్ దేవ్ బాబా మందుకు విపరీతమైన గిరాకీ ఉందని అంటున్నారు. పైగా ఇటీవల హర్యానా ప్రభుత్వం రామ్ దేవ్ బాబును అంబాసిడర్గా నియమించుకుంది.