మాకు తాగునీళ్లిస్తే, మీకు విద్యుత్ ఇస్తాం!: తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావిస్తున్న ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తిని చేయనుంది.
భవిష్యత్తులో తలెత్తే తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని కొంత నీటిని విడుదల చేయాలని మహారాష్ట్రను కోరాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోన్నట్లుగా తెలుస్తోంది.
కోయినా డ్యాం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి సముద్రంలోకి వదిలే నీటిలో 25 టీఎంసీలు ఇవ్వాలని, దానికి ప్రతిగా విద్యుత్తుకు అయ్యే మొత్తాన్ని లేదా విద్యుత్ కొనుగోలు చేసి తాము ఇస్తామనే ప్రతిపాదనలను మహారాష్ట్ర ముందు ఉంచనుందని తెలుస్తోంది.
శ్రీశైలం ప్రాజెక్టులో నీరు లేనందున భవిష్యత్తులో తాగునీటి సమస్యకు ఇబ్బందులు వస్తాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకు నీటిని ఇవ్వాలని మహారాష్ట్రను కోరనుంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడనున్నారని తెలుస్తోంది.