స్మార్ట్ సిటీ నా జేబులోదికాదు, పెంచుకోండి: వెంకయ్య
హైదరాబాద్: స్మార్ట్ సిటీగా ప్రకటించే అంశం తన జేబులోనిది కాదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాయదుర్గంలో జూబ్లీహిల్స్ రోడ్డులో ఆధునికీకరించిన శ్మశానవాటికను ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని ఇతర నగరాలు హైదరాబాదులో ఆధునికీకరించిన మహాప్రస్థానం శ్మశానవాటికను ఆదర్శంగా తీసుకొని, ఇలాంటివి నిర్మించాలన్నారు.
జీహెచ్ఎంసీ, ఫినిక్స్ స్వచ్చంధ సంస్థలు కలిసి ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య విధానంలో దీనిని నిర్మించాయి. వైఫై సేవలను అందుబాటులో ఉంచడం అభినందనీయమని వెంకయ్య అన్నారు. శ్మశానానికి స్థానిక, స్థానికేతర అన్న బేధం లేదన్నారు. ఎవరైనా చివరకు ఇక్కడకు రావాల్సిందే అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటివి మరిన్ని నిర్మించాలన్నారు.
వెంకయ్య నాయుడు
యదుర్గంలో జూబ్లీహిల్స్ రోడ్డులో ఆధునికీకరించిన శ్మశానవాటికను వెంకయ్య నాయుడు సోమవారం ప్రజలకు అంకితం చేశారు.
వెంకయ్య నాయుడు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని ఇతర నగరాలు హైదరాబాదులో ఆధునికీకరించిన మహాప్రస్థానం శ్మశానవాటికను ఆదర్శంగా తీసుకొని, ఇలాంటివి నిర్మించాలన్నారు.
వెంకయ్య నాయుడు
జీహెచ్ఎంసీ, ఫినిక్స్ స్వచ్చంధ సంస్థలు కలిసి ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య విధానంలో దీనిని నిర్మించాయి. వైఫై సేవలను అందుబాటులో ఉంచడం అభినందనీయమని వెంకయ్య అన్నారు.
వెంకయ్య నాయుడు
శ్మశానానికి స్థానిక, స్థానికేతర అన్న బేధం లేదన్నారు. ఎవరైనా చివరకు ఇక్కడకు రావాల్సిందే అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటివి మరిన్ని నిర్మించాలన్నారు.
వెంకయ్య నాయుడు
గతంలో అందరూ కలిసి చెరువులు, తూములను బాగు చేసుకునే వారని, ఇప్పుడు అవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణకు శ్మశానాలను కూడా వదలడం లేదన్నారు.
వెంకయ్య నాయుడు
నగరాలు స్వీయ ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. కొందరు తన వద్దకు వచ్చి తమ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరుతున్నారని, ఆ హోదా ఇవ్వడానికి అదేమీ తన జేబులోది కాదన్నారు.
వెంకయ్య నాయుడు
గతంలో రూ.765 కోట్ల ఆదాయమున్న జీహెచ్ఎంసీ ఇప్పుడు రూ.1000 కోట్లకు పైగా ఆర్జిస్తోందన్నారు. ఇందుకు కమిషనర్ సోమేష్ కుమార్కు అభినందనలు అన్నారు.
వెంకయ్య నాయుడు
యదుర్గంలో జూబ్లీహిల్స్ రోడ్డులో ఆధునికీకరించిన శ్మశానవాటికను వెంకయ్య నాయుడు సోమవారం ప్రజలకు అంకితం చేశారు.
గతంలో అందరూ కలిసి చెరువులు, తూములను బాగు చేసుకునే వారని, ఇప్పుడు అవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణకు శ్మశానాలను కూడా వదలడం లేదన్నారు. నగరాలు స్వీయ ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. కొందరు తన వద్దకు వచ్చి తమ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించాలని కోరుతున్నారని, ఆ హోదా ఇవ్వడానికి అదేమీ తన జేబులోది కాదన్నారు.
స్మార్ట్ నగరంగా మార్పు చెందాలంటే ప్రజల భాగస్వామ్యం, స్మార్ట్ నాయకత్వం కావాలన్నారు. నగరాలు స్వీయ ఆదాయం పెంచుకోవాలన్నారు. గతంలో రూ.765 కోట్ల ఆదాయమున్న జీహెచ్ఎంసీ ఇప్పుడు రూ.1000 కోట్లకు పైగా ఆర్జిస్తోందన్నారు. ఇందుకు కమిషనర్ సోమేష్ కుమార్కు అభినందనలు అన్నారు. తాగునీటి సమస్య పొంచు ఉన్నందున సక్రమంగా వినియోగించుకోవాలని, సింగపూర్ తరహాలో నీటిని రీసైక్లింగ్ చేసుకోవాలన్నారు.