షేమ్: ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒళ్లు తెలియకుండా ఓ ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రావణ్ వ్యాస్(50) అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మార్చి 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ఇలాంటి ఘటనే బాలఘాట్ జిల్లాలో 2013లో చోటు చేసుకుందని తెలిపారు.
కాగా, తాజా ఘటనలో నిందితుడు అఘాయిత్యానికి పాల్పడుతుండగా చూసిన ముగ్గురు మహిళలు మిథ్లేష్ కుమార్ అనే వ్యక్తికి విషయం చెప్పారు. మిథ్లేష్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. నిందితుడు డ్రగ్స్, మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.