ఆ మహిళ కన్యత్వానికి రూ.17కోట్లు: వేలంలో దక్కించుకున్న బడా వ్యాపారవేత్త..
సిండ్రిల్లా అనే ఎస్కార్ట్ సంస్థ అలెగ్జాండ్రా కెఫ్రెన్ కోసం ఈ భారీ వేలం ఆఫర్ ను తీసుకొచ్చింది. బడా వ్యాపారవేత్తతో డీల్ కుదిర్చినందుకు గాను ఈ సంస్థ 20శాతం వరకు చార్జీ చేయనుంది.
బుకారెస్ట్: ఆర్థిక అవసరాల కోసం కన్యత్వాన్ని వేలం పెట్టడం ఈరోజుల్లో కామన్గా మారింది. చదవు కోసమో, కుటుంబ అవసరాల కోసమో చాలామంది విదేశీ యువత కన్యత్వ వేలానికి సిద్దపడుతున్నారు. గతేడాది రొమేనియాకు చెందిన అలెగ్జాండ్రా కెఫ్రెన్(18) అనే మహిళ తన చదవుకు కావాల్సిన డబ్బు కోసం కన్యత్వాన్ని పణంగా పెట్టడంతో ప్రపంచమంతా నివ్వెరపోయింది.
కానీ అదే మహిళ ఇప్పుడు కన్యత్వ వేలం ద్వారా ఏకంగా రూ.17కోట్లు ఆర్జించనుంది. అలెగ్జాండ్రా కెఫ్రెన్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. జర్మనీకి చెందిన ఓ ఎస్కార్ట్ సంస్థ ద్వారా కన్యత్వ వేలాన్ని పూర్తి చేసుకున్న కెఫ్రెన్.. 2.5మిలియన్ యూరోలను దక్కించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించింది. హాంగ్ కాంగ్కు చెందిన ఒక వ్యాపారవేత్త వేలంలో ఇంత భారీ ధర వెచ్చించినట్లు చెబుతున్నారు.
కాగా, కన్యత్వ వేలంపై ఎదురవుతున్న విమర్శలను కెఫ్రెనా తిప్పికొడుతోంది. భవిష్యత్తులో ఎవరో ఒక స్నేహితుడికి తన కన్యత్వాన్ని కచ్చితంగా అర్పించాల్సిందేనని, ఆ తర్వాత అతను చదువు గురించి పట్టించుకోకుండా వెళ్లిపోతాడని, అదేదో ఇలాంటి వేలం ద్వారా కన్యత్వాన్ని వదులుకోవడానికి సిద్దపడితే చదువుకోవడానికి డబ్బులైనా వస్తాయని వాదిస్తోంది.
చాలామంది తన నిర్ణయాన్ని తప్పుపడుతున్నా.. నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కెఫ్రెనా చెబుతోంది. అయితే ఈ వాదనను తప్పుపడుతున్న వాళ్లు.. కెఫ్రెనా పేద మహిళ ఏమి కాదని, ఆమె సంపన్న కుటుంబానికి చెందిన మహిళేనని అంటున్నారు.
వేలానికి సహకరించినందుకు 20శాతం కమిషన్:
సిండ్రిల్లా అనే ఎస్కార్ట్ సంస్థ అలెగ్జాండ్రా కెఫ్రెన్ కోసం ఈ భారీ వేలం ఆఫర్ ను తీసుకొచ్చింది. బడా వ్యాపారవేత్తతో డీల్ కుదిర్చినందుకు గాను ఈ సంస్థ 20శాతం వరకు చార్జీ చేయనుంది. మిగతా డబ్బును అలెగ్జాండ్రాకు అందజేస్తారు. ఇదంతా ముందుగానే ఒప్పంద పత్రంలో రాసుకున్నట్లు తెలుస్తోంది.