తెలంగాణకు పన్ను చెల్లించాల్సిన శశికళ: నోటీసులు జారీ
అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను బకాయిలు చెల్లించాల్సివుంది.
చెన్నై/హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను బకాయిలు చెల్లించాల్సివుంది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఓ ఇల్లు ఉండగా, దానికి గత రెండేళ్ల నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదు.
నేడు కోర్టులో లొంగిపోనున్న శశికళ!: లీగల్ అడ్వైజర్ల సూచన ఇదే, జయ బ్యారక్కే శశి
పన్ను బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని సంకల్పించిన కేసీఆర్ సర్కారు, ఈ మేరకు శశికళ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. కాగా, ఈ ఇంటిని 1990 ప్రాంతంలో శశికళ కొనుగోలు చేశారు.
కుట్రస్థానం పోయెస్ గార్డెన్, జయే మాస్టర్ మైండ్: సుప్రీం కీలక వ్యాఖ్యలివే
అప్పట్లో హైదరాబాద్ కు వచ్చినప్పుడు కొంతకాలం జయలలిత ఇదే ఇంట్లో బస చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆపై ప్రైవేటు వ్యక్తులకు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చినప్పటి నుంచి, వారు ఖాళీ చేసి వెళ్లిన తరువాత గత నాలుగేళ్లుగా ఈ ఇల్లు ఖాళీగానే ఉందని తెలుస్తోంది.