హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ రాత్రికి ప్రణబ్ తో కెవిపి భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

Pranab Mukherjee
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు బుధవారం రాత్రి 9 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే విషయంపై ఆయన ప్రణబ్ తో మాట్లాడుతారు. కెవిపి రామచందర్ రావు మంగళవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. బుధవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. అంతకు ముందు ఆయన కాంగ్రెసు నేత దిగ్విజయ్ సింగ్ ను కెవిపి కలుసున్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్న కెవిపి పార్టీ అధిష్ఠానవర్గానికి చెందిన నేతలందరితో సమావేశమవుతున్నారు.

రాష్ట్ర పరిస్థితులను తాను పార్టీ నేతలకు వినిపిస్తున్నానని కెవిపి చెప్పారు. జగన్ కు రాష్ట్ర శాసనసభ్యుల మద్దతు ఉందనే విషయం పార్టీ అధిష్ఠాన వర్గానికి తెలియదని తాను అనుకోవడం లేదని, పార్టీ అధిష్ఠాన వర్గానికి అన్ని విషయాలు తెలుసునని ఆయన ఒక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో సోనియా గాంధీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X