జగన్ ను పిసిసి అధ్యక్షుడిని చేయాలి: మారెప్ప
ఇప్పుడు పార్టీ మనుగడ కోసం జగన్ను పీసీసీ చీఫ్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్ల టికెట్లు రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయని, ఇది కాంగ్రెస్కు తీరని కళంకమన్నారు. నిజాయితీ గల నాయకులు ఉన్నత స్థానంలో ఉంటే క్రమశిక్షణ దానంతట అదే వస్తుందని చెప్పారు. వార్డు మెంబర్లుగా పనికిరానివారు నామినేటెడ్ పోస్టులు దక్కించుకుని అతిగా ప్రవర్తిస్తున్నారని కొందరు సీనియర్ నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన సమర్థులను ఎంపిక చేయడంలో అధిష్ఠానం విఫలమైందనిన్నారు.
Comments
Story first published: Sunday, November 8, 2009, 16:12 [IST]