ప్రముఖ రచయిత పతంజలి ప్రధమ వర్ధంతి నేడు

అటు తర్వాత ఆంధ్రభూమి, మహానగర్లలో కూడా పని చేశారు. 'పతంజలి పత్రిక' పేరిట పత్రికను నెలకొల్పి 16 నెలల పాటు నడిపారు. 2003లో ఆంధ్రప్రభలో అవకాశం రావడంతో అందులో చేరారు. కొద్ది నెలలు టీవీ 9లో విధులు నిర్వర్తించారు. 'సాక్షి' పత్రిక ఆవిర్భావం నుంచి ఎడిటర్గా వ్యవహించారు. కొద్ది నెలల్లోనే ఆయన ఆరోగ్యం క్షీణించటంతో ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న తరువాత మళ్లీ ఎడిటర్గా విధులు నిర్వహించారు. అయితే మరోసారి తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో ఈ దఫా మృత్యువుదే పైచేయి అయింది.
పతంజలి ఎన్నో నవలలు, కథలు, కథనాలు రాశారు. అందులో ఖాకీవనం, రాజుగోరు, వీరబొబ్బిలి, పెంపుడు జంతువులు, అప్పన్న సర్దార్, గోపాత్రుడు, ఒకదెయ్యం ఆత్మకథ, పిలక తిరుగుడు పువ్వు, మేరా భారత్ మహాన్, రాజుల లోగిళ్లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. పతంజలికి ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి. రావిశాస్త్రి రచనా పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం ఇందులో ప్రధానమైనవి. కృష్ణవంశీ 'సింధూ రం' సినిమాకు ఆయనకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు దక్కింది. అనంతరం చంద్రసిద్ధార్థ 'ఇదీసంగతి'కి కథ, మాటలు రాశారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పతంజలి ముందుండేవారని ఆయన సహచరులు చెబుతుంటారు. రచన, జర్నలిజం, వైద్యం...ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ఎందరికో ఆదర్శప్రాయులు. నవతరం రచయితలకు స్ఫూర్తిప్రదాత. ఆయన మరణించి ఏడాది అయిన సందర్భంగా ఆయన్ను ఒక్కసారి గుర్తు చేసుకుని అంజలి ఘటించడం మనందరి బాధ్యత.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications