కృష్ణాలో గాలిదుమారానికి నేలరాలిన మామిడి
చాట్రాయి, విస్సన్నపేట, నూజివీడు, హనుమాన్జంక్షన్, తిరువూరు, మైలవరం, గన్నవరం, బాపులపాడు, నందిగామ, వీరులపాడు, జగ్గయ్యపేట, కైకలూరు, గుడివాడ, మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాలను గాలి దుమారం చుట్టుముట్టింది. జనజీవనం స్తంభించిపోయింది. ఈ ఏడాది కాపు తక్కువగా ఉండటంతో మామిడి మంచి ధర పలుకుతున్న దశలో గాలి దుమారం రావడంతో భారీగా దెబ్బతిన్నామని రైతులు వాపోతున్నారు. గురువారానికి గాని ఎంత నష్టం జరిగిందో తెలియదని అధికారులు చెబుతున్నారు. వేలాది ఎకరాల్లో పొట్టదశకు వచ్చిన వరి పైరు గాలికి నేలకొరిగింది. దీనికితోడు కురిసిన వర్షానికి పంట నష్టం పెద్ద ఎత్తున జరిగి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
Story first published: Thursday, April 22, 2010, 9:05 [IST]