వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేకాధికారి ధర్మారెడ్డిపై దండెత్తిన టిటిడి ఉద్యోగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirupati
తిరుపతి: ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి తీరుపై తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. సీనియర్ అసిస్టెంట్ సురేష్ కుమార్ ఆత్మహత్యతో ఆగ్రహించిన సిబ్బంది ధర్మారెడ్డిపై మండిపడుతున్నారు. టిటిడి పాలక మండలి ముందు వారు ఆందోళనకు దిగారు. ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మారెడ్డి వేధింపుల వల్లనే సురేష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపించారు. ధర్మారెడ్డిని పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదిలా వుంటే, ధర్మారెడ్డిపై పాలకమండలి మాజీ సభ్యుడు ఎం.అంజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. టిటిడిలో జరుగుతున్న అక్రమాలన్నింటికీ ధర్మారెడ్డే కారకుడని అంజయ్య విమర్శించారు. ఆర్జిత సేవా టికెట్లన్నీ ధర్మారెడ్డే అమ్ముకున్నారని అన్నారు. కొన్ని కులాల అణచివేత కుట్రలో తాము బలయ్యామని చెప్పారు. 2004 నుంచి ఇప్పటివరకు సమగ్ర విచారణ చేపడితే ఎన్నో నిజాలు బయటకు వస్తాయని అంజయ్య అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X