కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏ విధమైన త్యాగాలకైనా సిద్ధమంటున్న వైయస్ జగన్ క్యాంప్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం చెబుతోంది. జగన్ ఓదార్పు యాత్రలో తాము పాల్గొని తీరుతామని అంటోంది. అధిష్టానం తమపై ఏ విధమైన చర్యలు తీసుకున్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. తాను జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొని తీరుతానని గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. తాను రాజకీయ త్యాగానికి కూడా సిద్ధపడి ఉన్నట్లు గురువారం చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గకూడదని తనకు వైయస్ రాజశేఖర రెడ్డి నేర్పారని, వైయస్ మాట ప్రకారం తాను నడుచుకుంటానని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని, అందువల్ల వైయస్ కుటుంబం కోసం తాను ఎంతటి త్యాగానికైనా సిద్ధపడి ఉన్నానని ఆయన అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు. తాను జగన్ వెంటే ఉంటానని ఆయన చెప్పారు. జగన్ వెంట ఉండడం వల్ల ఎదురయ్యే చర్యలకు తాను సిద్ధపడి ఉన్నానని ఆయన అన్నారు. అధిష్టానం రాయబారిగానే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ఇడుపులపాయకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X