హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతు సమస్యలపై అసెంబ్లీ ఎదుట టిడిపి, వామపక్షాలు ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్‌: రైతు సమస్యలపై తెలుగుదేశం, వామపక్షాల శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు శుక్రవారం ఉదయం శాసనసభ ఎదురుగా గల గన్ పార్కు వద్ద ధర్నాకు దిగారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారు ఈ ధర్నాకు దిగారు. రైతుల పంటలకు మద్దతు ధర ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని వారన్నారు.

రైతుల కష్టాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేయించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వర రావు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X