హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గోషా మహల్ నుంచి అసెంబ్లీకి టిడిపి నేతలతో చంద్రబాబు పాదయాత్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: రైతు సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహా తెలుగుదేశం, వామపక్ష శాసనసభ్యులు గోషామహల్‌ స్టేడియం నుంచి శాసనసభ వరకు పాదయాత్ర సాగించారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, వామపక్ష నాయకులు, కార్యకర్తలు గోషామహల్‌ స్టేడియానికి వచ్చారు. దీంతో స్టేడియం వద్ద భారీసంఖ్యలో పోలీసులు మోహరించారు. సోమవారం సాయంత్రం నుంచి చంద్రబాబు సహా తెలుగుదేశం, వామపక్ష ఎమ్మెల్యేలు గోషామహల్‌ స్టేడియంలోనే గడిపారు. శాసనసభ సమావేశాలు ముగిసేలోగా రైతు సమస్యలు పరిష్కరించకుంటే 17 నుంచి ఆమరణ దీక్ష చేపడతామని చంద్రబాబు చెప్పారు.

రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని చంద్రబాబు అన్నారు. తమకు ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఫర్వాలేదని, రైతుల సమస్యలు పరిష్కారమైతే చాలని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించమని అడిగితే రైతు నాయకులు, తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దారుణమన్నారు. రైతు సమస్యలు పరిష్కరించకపోతే 17 నుంచి వేలాది మందితో పోరాటాలు చేస్తామని జూలకంటి రంగారెడ్డి అన్నారు. అరెస్టులతో ప్రజాపోరాటాలను ఆపలేరని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X