గోషా మహల్ నుంచి అసెంబ్లీకి టిడిపి నేతలతో చంద్రబాబు పాదయాత్ర
రైతుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని చంద్రబాబు అన్నారు. తమకు ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఫర్వాలేదని, రైతుల సమస్యలు పరిష్కారమైతే చాలని చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించమని అడిగితే రైతు నాయకులు, తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దారుణమన్నారు. రైతు సమస్యలు పరిష్కరించకపోతే 17 నుంచి వేలాది మందితో పోరాటాలు చేస్తామని జూలకంటి రంగారెడ్డి అన్నారు. అరెస్టులతో ప్రజాపోరాటాలను ఆపలేరని అన్నారు.
Comments
Story first published: Tuesday, December 14, 2010, 8:43 [IST]