వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ దీక్షకు వెళ్లినవారిపై చర్యలు తీసుకుంటాం: అభిషేక్ సింఘ్వీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Abhishek Singhvi
న్యూఢిల్లీ: తమకు వ్యక్తులు ముఖ్యం కాదని, పార్టీయే ముఖ్యమని ఏఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ శుక్రవారం న్యూఢిల్లీలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. పార్టీలో ఉండే ప్రతి ఒక్కరి ఆశలు, ఆశయాలు పార్టీకి లోబడే ఉండాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు పార్టీకోసం అందరూ పక్కన పెట్టాలని చెప్పారు. జగన్ లక్ష్యదీక్షలో శాసనసభ్యులు పాల్గొన్నట్టు పక్కా ఆధారాలు ఉంటే పార్టీ అధిష్టానం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారిని ఉపేక్షించబోం అని చెప్పారు. పక్కా ఆధారాలు లభిస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రభుత్వం 110 శాతం పక్కాగా ఉందన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సరియైన సాయం అందించిందన్నారు. రైతులపై మా ప్రభుత్వం బాగానే స్పందిస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదన్నారు. ప్రభుత్వం స్పందిస్తున్నప్పటికీ దీక్షలు చేపట్టడం చంద్రబాబుకు గానీ, జగన్ కు గానీ సరియైన పద్ధతి కాదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X