కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ కడప కార్యాలయంపై దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadapa
కడప‌: కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగింది. కడపలోని రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ కార్యాలయం ఉంది. దాడి చేసిన దండగులు కార్యాలయంలోని ఫర్నీచర్‌ను, రికార్డులను ధ్వంసం చేశారు. దాడి ఎవరు చేశారనేది తెలియడం లేదు. పోలీసుల విచారణలో నిజాలు తెలుస్తాయని మంత్రి సాయి ప్రతాప్ అంటున్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరని ఆయన చెప్పారు. దాడికి రాజకీయ కారణాలు లేకపోవచ్చునని ఆయన అన్నారు. పోలీసులు కూడా దాడిపై ఏమీ చెప్పలేకపోతున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గానీ శనివారం తెల్లవారు జామున గానీ సాయి ప్రతాప్ కార్యాలయంపై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల విషయంలో సాయి ప్రతాప్ అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఇటు కాంగ్రెసు పార్టీకి గానీ, అటు వైయస్ జగన్‌కు గానీ ఆయన మద్దతు ప్రకటించడం లేదు. కాంగ్రెసులో ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సాయి ప్రతాప్ ఉప ఎన్నికలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు.

English summary
Minister for state Sai Pratap camp office at Kadapa was attacked. Reasons for attack is not known. Furniture and records were destroyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X