కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ కడప కార్యాలయంపై దాడి
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గానీ శనివారం తెల్లవారు జామున గానీ సాయి ప్రతాప్ కార్యాలయంపై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల విషయంలో సాయి ప్రతాప్ అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ఇటు కాంగ్రెసు పార్టీకి గానీ, అటు వైయస్ జగన్కు గానీ ఆయన మద్దతు ప్రకటించడం లేదు. కాంగ్రెసులో ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సాయి ప్రతాప్ ఉప ఎన్నికలపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు.
Comments
English summary
Minister for state Sai Pratap camp office at Kadapa was attacked. Reasons for attack is not known. Furniture and records were destroyed.
Story first published: Saturday, April 16, 2011, 9:55 [IST]