కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వెంట మరో కాంగ్రెసు ఎమ్మెల్యే

By Pratap
|
Google Oneindia TeluguNews

Chennakeshava Reddy
కర్నూలు: కర్నూలు జిల్లాలో కాంగ్రెసు పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పాణ్యం శాసనభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తుండగా, తాజాగా మరో శాసనసభ్యుడు కూడా వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శాసనసభ్యుడు చెన్నకేశవ రెడ్డి సోమవారం వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు చెన్నకేశవ రెడ్డి ఈ ఓదార్పులో పాల్గొని జగన్‌కు మద్దతు తెలిపారు.

కర్నూలు జిల్లాలో సోమవారం వైయస్ జగన్ ఓదార్పు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర ఈ నెల 30వ తేదీ వరకు సాగుతుంది. దాదాపు 203 గ్రామాలను సందర్శించి 31 కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. ఆయన సోమవారం సాయంత్రం తనకు మద్దతు తెలుపుతున్న ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు శోభానాగిరెడ్డి నియోజకవర్గం ఆళ్లగడ్డలో ఓదార్పు యాత్ర చేశారు.

English summary
In another jolt to Congress party in Kurnool district, Panyam MLA Katasani Rambhupal Reddy and Yemmiganur MLA Chennakesava Reddy accompanied YSR Congress party supremo Y S Jaganmohan Reddy during the first day of his Odarpu yatra in the district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X