జెడి కాల్ డేటా లీక్ వెనక మిక్ ఎలక్ట్రానిక్స్ రమణారావు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న లక్ష్మినారాయణను బ్లాక్ మెయిల్ చేయడానికే ఈ కాల్ డేటాను సేకరించినట్లు తెలుస్తోంది. లక్ష్మినారాయణ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఏ విధమైన దరఖాస్తు లేకుండానే కాల్ డేటాను పొందినట్లు సిఐడి తెలిపింది. సిబిఐకి దురుద్దేశాలను అంటగడుతూ జెడి కాల్ డేటాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జూన్ 21వ తేదీన వెల్లడించిన విషయం తెలిసిందే.
సిబిఐ జెడి లక్ష్మినారాయణ కాల్ డేటా కోసం టెలికం అధికారులతో పరిచయాలు ున్న మిక్ ఎలక్ట్రానిక్స్కు చంెదిన డాక్టర్ ఎంవి రమణారావును సంప్రదించినట్లు, దీంతో గతంలో విజయవాడ, హైదరాబాదుల్లో పనిచేసి ప్రస్తుతం నాగపూర్లో టెలికం డిడిజిగా ఉన్న కె. హనుమంతరావును సంప్రదించినట్లు సిఐడి తెలిపింది.
దీంతో హనుమంతరావు జెడి కాల్ డేటాను సేకరించి రమణారావుకు ఇచ్చినట్లు సిఐడి చెప్పింది. దాంతో పెన్ డ్రైవ్లో రఘురామరాజుకు రమణారావు ఆ కాల్ డేటాను అందించారు. ఈ వివరాల ఆధారంగానే రఘురామ రాజు కోర్టులో కేసు వేసినట్లు తెలుస్తోంది.