గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాళహస్తి ఆలయఉద్యోగి వ్యభిచారం: పిల్లల్నిచంపిన తల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chittoor Map
చిత్తూరు/గుంటూరు: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఓ ఆలయ ఉద్యోగి వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డాడు. మోహన్ అనే వ్యక్తి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు పూజల ఇంచార్జిగా పని చేస్తున్నాడు. అతను ఆలయానికి సమీపంలోనే వ్యభిచారం చేస్తుండగా పట్టుబడ్డాడు. పోలీసులు అతనిని స్టేషన్‌కు తరలించారు. మోహన్ పైన కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.

మోహన్ ఓ పార్లమెంటు సభ్యుడికి అనుచరుడిగా చెబుతున్నారు. దీంతో అతనిపై కేసు నమోదు చేయకుండా రాజీ కోసం పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయని అంటున్నారు. మోహన్ మహిళతో రాసలీలలు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. అతనిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

మరోవైపు గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని రాజీవ్ నగర్‌లో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపింది. శైలజ, సురేష్‌లు భార్యాభర్తలు. సురేష్ ఆటో నడుపుతుంటాడు. అతనికి మరో మహిళతో సంబంధముందని తెలిసిన భార్య శైలజ భర్తకి నచ్చ చెప్పే ప్రయత్నాలు చేసిందని సమాచారం. అతను వినకపోవడంతో విసిగిపోయిన ఆమె చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.

తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అవుతారని భావించి తొలుత తన పిల్లలైన నాలుగేళ్ల అజయ్, మూడేళ్ల విజయ్‌లకు ఉరి వేసి చంపింది. ఆ తర్వాత తాను విషం తాగింది. ఇది గమనించిన గ్రామస్తులు ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాను చస్తానని అనుకున్నానని, కానీ చావలేదని, తాను చస్తే పిల్లలు ఏమవుతారో అనే బాధతోనే వారికి ఉరి వేసినట్లు చెప్పింది. కాగా భర్త సురేష్ పరారీలో ఉన్నాడు.

English summary

 A mother from Guntur district was killed her two children on Wednesday with family problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X