నిర్మానుష్యంగా రోడ్లు, రైళ్లను ఆపారు(బంద్ పిక్చర్స్)
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండో రోజు సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. 11 కార్మిక సంఘాలు చేపట్టిన రెండు రోజుల సమ్మెలో భాగంగా రెండో రోజైన గురువారం ప్రశాంతంగా కొనసాగుతోంది. కార్మిక, ఉద్యోగ సంఘాల సమ్మె కారణంగా బుధవారం జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దేశ, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సభలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన ట్రేడ్ యూనియన్ల నేతలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
సార్వత్రిక సమ్మె రెండో రోజు ర్యాలీలు, ధర్నాలతో తమ సమస్యల పరిష్కారానికి గళమెత్తుతున్నారు. తమ డిమాండ్ల కోసం అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. భారత్ బంద్ సామాన్య జన జీవనాన్ని ఇబ్బందులకు గురి చేసింది. కేరళ, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో భారత్ బంద్ ప్రభావం బుధవారం అంతగా కనిపించలేదు.
కర్నాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, నోయిడా వంటి పట్టణాల్లో బుధవారం ఆటోలు, బస్సులు నడవలేదు. కొన్ని ప్రాంతాలలో కొందరు ఫ్యాక్టరీలలోకి వచ్చి దోచుకున్నట్లుగా కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బందును కాదని పనులు చేసేందుకు వెళ్తున్న పలువురి పైన బంద్ చేస్తున్న కార్మికులు రాళ్లు విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. హైదరాబాదులో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది.
తొలిరోజు అలహాబాదులో మూతబడిన ఓ బ్యాంకు
ప్పుడు బిజీగా కనిపించే హౌరా బ్రిడ్జి
పశ్చిమ బెంగాల్లో ప్రయాణీకులు లేకుండా ప్లాట్ ఫారం
కోల్కతాలో ఒకే వేదిక వద్దకు వచ్చి సమ్మెలో పాల్గొన్న పూల వ్యాపారులు
బస్సును ఆపే ప్రయత్నం చేస్తున్న మహిళా కార్యకర్త
మూతబడిన సినిమా థియేటర్ ముందు క్రికెట్ ఆడుతున్న చిన్నారులు
మంగళూరులో జాతీయ రహదారి-66
భువనేశ్వర్లో ఏఐటియుసి కార్యకర్తలు
న్యూఢిల్లీలో ఆర్బిఐ వద్ద ఆందోళన
పాట్నాలో రైలును ఆపుతున్న నిరసనకారులు
అగర్తాలాలో రహదారులు
చాందినీ చౌక్లో..
కార్మికుల నిరసన
చాందినీ చౌక్ మార్కెట్లో దృశ్యం
చాందినీ చౌక్ మార్కెట్లో..
ఓ వర్క్ షాపులో..
అజ్మీర్లో బండిపై వెళ్తున్న విదేశీ పర్యాటకులు
గౌహతిలో రైల్వే ట్రాకు పైన నుండి సిఐటియు, ఐన్టియుసి, బిఎంఎస్, ఎఐటియుసి కార్యకర్తలను లాగుతున్న పోలీసులు
కోల్కతాలో నిరీక్షిస్తున్న ప్రయాణీకులు
రైళ్లను అడ్డుకుంటున్న నిరసనకారులు