తాగుడు మానండి!: కెసిఆర్కి సలహా, టిడిపి ఎదురుదాడి
తెలంగాణ రాష్ట్ర సమితి తాగి ఊగే పార్టీ అన్నారు. కెసిఆర్ తాగుడు మాని ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఉద్యమం ముసుగులో కెసిఆర్ కుటుంబం వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు, బయ్యారంపై పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీయే అన్నారు. టిడిపిని విమర్శించే కెసిఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎందుకు విమర్శించరని ఘాటుగా ప్రశ్నించారు.
తెలంగాణ ముసుగులో మోసం.. రమేష్ రాథోడ్
తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ముసుగులో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ విమర్శించారు. కెసిఆర్ ఇప్పటికైనా ఫాం హౌస్ రాజకీయాలు మానుకొని ఉద్యమ అజెండాతో పోరాడాలని సూచించారు.
కెసిఆర్ ఫాంహౌస్కే పరిమితమవుతూ తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని పబ్బం గడుపుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్లమెంటు బయట కాకుండా లోపల తమ నిరసనను వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి హయాంలోనే తెలంగాణకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందన్నారు.