గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వచ్ఛ భారత్‌లో విషాదం: పాముకాటుతో బాలుడి మృతి

|
Google Oneindia TeluguNews

A boy died with snake bite
కడప: జిల్లాలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. వేంపల్లి మండలంలోని ఇడుపులపాయలోని మారుతీనగర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ‘స్వచ్ఛ భారత్' కార్యక్రమం చేపట్టారు.

పాఠశాల ప్రాంగణం శుభ్రం చేస్తుండగా.. పిచ్చిమొక్కల్లో దాక్కున్న పాము మూడవ తరగతి విద్యార్థిని కాటువేసింది. దీంతో బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే విషం శరీరమంతా పాకడంతో మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

రసీదు అడిగితే దాడి చేశాడు

సెల్ బిల్లు కట్టేందుకు వెళ్లిన వినియోగదారుడిపై రాడ్డుతో డీలర్ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. ఒప్పించర్లకు చెందిన తోట సిద్ధయ్య తన సెల్ ఫోన్ బిల్లు కట్టేందుకు నరసరావుపేటకు వచ్చాడు. డీలర్‌కు బిల్లు చెల్లించి రసీదు కావాలని అడిగాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఆగ్రహానికి గురైన డీలర్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మంగళపతి రెడ్డి పక్కనే ఉన్న రాడ్డు తీసుకుని సిద్ధయ్య తలపై కొట్టాడు. దీంతో సిద్దయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడ్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A boy died with snake bite in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X