బలవంతంగా పెళ్ళిచేస్తున్నారంటూ కూతురు ఫిర్యాదు
ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయిన ఇంటర్ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.అయితే తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేసేందుకు ప్రయత్నించడంతో పారిపోయినట్టు చెప్పారు.
కర్నూల్: ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయిన ఇంటర్ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.అయితే తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేసేందుకు ప్రయత్నించడంతో పారిపోయినట్టు చెప్పారు.
కర్నూల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయింది. అయితే ఆమెను ఓ యువకుడు కిడ్నాప్ చేశాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఆ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్ళిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఓ వినతిపత్రం రాశారు.
తనను ఎవరూ కూడ కిడ్నాప్ చేయలేదన్నారు. పెళ్ళిచేయకుండా తల్లిదండ్రులను ఒప్పించాలని ఆమె ఎస్పీకి రాసిన వినతిపత్రంలో కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక వినతి మేరకు తల్లిదండ్రులను పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.