వేరే మహిళతో భర్త రాసలీలల్లో, రెడ్ హ్యండెడ్ గా పట్టుకొన్న భార్య
విడాకులు ఇచ్చేయమంటూ భార్యను వేధించడమే కాకుండా తన ఆత్మహత్యాయత్నానికి భార్యే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి మరో మహిళతో రాసలీలలు కొనసాగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ ను సోమవారం రాత్రి విజయవాడ పోలీసు
విజయవాడ: విడాకులు ఇచ్చేయమంటూ భార్యను వేధించడమే కాకుండా తన ఆత్మహత్యాయత్నానికి భార్యే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి మరో మహిళతో రాసలీలలు కొనసాగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ ను సోమవారం రాత్రి విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా భట్టిప్రోలుకు చెందిన కానిస్టేబుల్ అదే ప్రాంతానికి చెందిన వివాహితతో సింగ్ నగర్ షాదీఖానా సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
అయితే తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని గమనించిన భార్య పోలీసులకు పట్టించింది.
భట్టిప్రోలు గ్రామానికి చెందిన రాజేష్ బాబుకు రాణితో ఎమిమిదేళ్ళ క్రితం వివాహమైంది.అయితే ఆ సమయంలో కట్న కానుకల కింద రూ.3 లక్షలు ఇచ్చారు. ఇతర లాంఛనాలను కూడ అందించారు. పెళ్ళి సమయానికి రాజేష్ మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
ఈ విషయం తెలిసి భార్య నిలదీయడంతో భర్తతోపాటు అత్త , మరిది వేధింపులు ప్రారంభించారు. వీరి వేధింపులు నుండి రక్షణ కల్పించాలని భార్య రాణి భట్టిప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాది డిసెంబర్ లో రాజేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు మంగళగిరి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
తనపై అక్రమంగా కేసు పెట్టిన భర్తపై రాణి నిఘా పెట్టింది. అజిత్ సింగ్ నగర్ షాదీఖానా సమీపంలో మరో మహిళతో రాజేష్ ఉంటున్నాడని గుర్తించింది. కుటుంబసభ్యుల సహకారంతో అజిత్ సింగ్ నగర్ పోలీసులకు పట్టించింది. కానిస్టేబుల్ ను వివాహితను పోలీసులు విచారిస్తున్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహారించుకోవడంతో పాటు తన కాపురాన్ని పోలీసులు చక్కదిద్ది న్యాయం చేయాలని రాణి కోరుతోంది.