రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొద్దిగంటల్లో పెళ్లి: ప్రియురాలితో పరారైన వరుడు

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: మరో కొద్ది గంటల్లో తనకు వివాహం జరుగుతుందనగా.. ఓ ప్రబద్ధుడు తన ప్రియురాలి కలిసి పరారయ్యాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తామెపల్లి మండలం గరిడేపల్లిలో ఉదయం 9గంటలకు ఓ అబ్బాయికి అమ్మాయికి వివాహం జరగాల్సి ఉంది.

కాగా, అంతకన్నా ముందే ఆ వరుడు ఎవరికీ తెలియకుండా తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడు. దీంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న ఇరు కుటుంబాలవారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

A man allegedly eloped with his lover, to escape from marriage

పాలేరులో వివాహిత ఆత్మహత్య

కూసుమంచి మండలంలోని పాలేరులో మంగళవారం ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ముమ్మడి నాగేంద్ర(50) కడుపు నొప్పి తాళలేక మంగళవారం వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితి లో ఉన్న నాగేంద్రను ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా చికి త్సపొందుతూ మృతి చెందింది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు న్నారు.

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఖమ్మం: కుటుంబ కలహాలు, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బురాన్‌పురం లో నివాసముంటున్న ఎజ్జు బాబురావు (42) కార్పెంటర్‌ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్నాడు. మే 3న భార్యతో కలిసి బంధువుల ఇంటికి ఓ శుభకార్యానికి వెళ్లారు.

మే 4న బాబురావు ఒక్కడే ఇంటికి వచ్చాడు. మంగళవారం వచ్చి చూడగా వంట గదిలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డాడని మృతుని భార్య షర్మిల పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A man has allegedly eloped with his lover, to escape from marriage in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X