తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి అదృశ్యం: బీచ్‌లో విగతజీవిగా తెలుగు విద్యార్థి

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుపతి నగరానికి చెందిన ఓ యువకుడు అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక తుడా ప్లాట్స్‌లో నివాసం ఉంటున్న గల్లా నాగేశ్వరరావు కుమారుడు ప్రవీణ్‌(23) అమెరికాలో ఎం.ఎస్‌ చేసేందుకు వెళ్లాడు.

ప్రస్తుతం ఎం.ఎస్‌ రెండో సంవత్సరం చేస్తున్నాడు. ఫిబ్రవరి 1వ తేదీన అమెరికాలో అదృశ్యమయ్యాడు. న్యూపోర్టు బీచ్‌ వద్ద మృతదేహాన్ని బుధవారం గుర్తించినట్లు తెలిసింది. ప్రవీణ్ మృతి చెందాడని విషయం తెలిసిన తిరుపతిలోని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

A telugu student allegedly died in America

కాగా, విద్యాపరమైన సమస్యల వల్ల ప్రవీణ్ డిప్రెషన్‌కు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రవీణ్ భువనేశ్వర్‌లో గీతం విశ్వవిద్యాలయంలో చేరారు. అతని స్వస్థలం తిరుపతి. అతని తండ్రి గల్లా నాగేశ్వర రావు ఐరాల మండలం నెల్లిమర్లకు చెందినవాడు.

అయితే, తిరుపతిలో స్థిరపడ్డాడు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రవీణ్ జాడ తెలియలేదు. ఇప్పుడు విగత జీవిగా మారడంతో ప్రవీణ్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

English summary
A telugu student, who is belongs to Tirupati, allegedly died in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X