అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య

|
Google Oneindia TeluguNews

కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం ఆరుగొలనులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంగా భార్య భర్తను చంపిందని పోలీసులు చెప్పారు. కేసును పోలీసులు విచారిస్తున్నారు.

ఆటో బోల్తా: ఏడుగురికి తీవ్ర గాయాలు

నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం అక్కరపాక సమీపంలో శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

A woman allegedly murdered her husband in Krishna district.

క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుని అనుమానాస్పద మృతి

అనంతపురం జిల్లాలోని సోమనదేపల్లి మండలం రేణుకానగర్ ప్రాంతానికి చెందిన చంద్రమౌళి అనే యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. .శుక్రవారం ఉదయం పొలంలోని విశ్రాంతి గదిలో చంద్రమౌళి నిర్జీవంగా పడి ఉండటాన్ని ఆయన తండ్రి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, చంద్రమౌళి పాము కాటు వల్ల మృతి చెందాడా లేక మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.

English summary
A woman allegedly murdered her husband in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X