హుస్సేన్సాగర్లో దూకిన యువకుడు: తండ్రి కన్నీరుమున్నీరు
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్సాగర్లో దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడిని కాపాడేందుకు తండ్రి కూడా హుస్సేన్సాగర్లో దూకాడు. యువకుడు గల్లంతు కాగా, తండ్రిని మాత్రం స్థానికులు కాపాడగలిగారు. యువకుడి కోసం పోలీసులు హుస్సేన్సాగర్లో గాలిస్తున్నారు. యువకుడి కోసం తండ్రి కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.
చెట్టును ఢీకొన్న ఆటో..ఇద్దరు మృతి
నల్గొండ జిల్లాలోని కత్తాల్గూడ దగ్గర ఓ ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
జీపు బోల్తా:నలుగురు మృతి
కడప జిల్లాలోని దువ్వూరు వద్ద వేగంగా వెళుతున్న క్వాలిస్ జీపు అదుపుతప్పి బోల్తాపడడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. శబరిమలై నుంచి అయ్యప్పభక్తులతో ఈ జీపు మహబూబ్నగర్ జిల్లాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలుకు చెందిన వీరు శబరిమలై నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. శుక్రవారం ఉదయం గంగవరం మండలం దంగేరు వద్ద ఆగివున్న లారీని ఓ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.