వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తహశీల్దార్ ఇళ్లపై ఏసీబీ దాడులు.. భారీగా నగదు, నగలు, ఆస్తిపత్రాలు లభ్యం

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తహశీల్దార్ బి.టి.వి. రామారావు ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. భారీ ఎత్తున నగదు, నగలు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

భీమునిపట్నం: విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తహశీల్దార్ బి.టి.వి. రామారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్ లో రెండు చోట్ల, రాజమండ్రిలో ఒక చోట, విశాఖపట్నంలో నాలుగు చోట్ల ఈ దాడులు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న రామారావుకు సంబంధించిన ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.

ACB Rides on Tahasildar's Houses.. Huge Money, Ornaments, Assets Seized

రామారావు అల్లుడి ఇంట్లో భారీ ఎత్తున నగదు లభ్యమైనట్లు సమాచారం. అలాగే.. రామారావు ఇంట్లో కూడా రూ.15 లక్షలను అధికారులు గుర్తించారు. ఆయన అల్లుడి ఇంట్లో రూ.30 లక్షల నగదును గుర్తించారు.

ఇంకా రామారావుకు సంబంధించిన ఆయా ప్రాంతాల్లోని ఇళ్లల్లో నగదు, ఆభరణాలు, ఆస్తి పత్రాలు దొరికినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయని, పూర్తయిన తరువాతే మొత్తం సమాచారం బయటికి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

English summary
Officials of the Anti-Corruption Bureau have launched raids on the properties of Bhimunipatnam Tahasildar B.T.V. Rama Rao spread over 7 places on Wednesday. Special teams formed by the ACB took part in the raids which were carried out at the properties of relatives of Tahasildar Rama Rao. During the rides Huge Currency, Ornaments and documents were seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X