ఘోర రోడ్డు ప్రమాదంం నలుగురు మృతి
గార్లదిన్నె: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కునుంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు కునుంపల్లి వద్ద డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో అరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులను తమిళనాడు వాసులుగా గుర్తించారు.
వీరంతా శ్రీశైలం నుంచి అనంతపురంలోని బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ను ఏపీ 02 ఏఎన్ 6255గా పోలీసులు గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకు క్షతగాత్రులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు.
Comments
English summary
Four killed in a road accident in Anantapur district on Monday morning.
Story first published: Monday, July 3, 2017, 8:45 [IST]