వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నాడా తర్వాత.. ఏపీకి మరో ముప్పు: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను
నాడా తుఫాను అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడింది.
విశాఖ/విజయవాడ: నాడా తుఫాను అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాను పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడింది. ఈ తుపాను సూపర్ సైక్లోన్గా మారే అవకాశముందని వాతావరణ కేంద్రాలు వెల్లడిస్తున్నాయి.
ఎక్కువగా కోస్తా తీరం పైనే ఈ తుపాను ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. నాడా తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది బలహీనపడింది. అయితే, ఈ తుఫాను అనంతరం తాజాగా మరో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడింది.
రేపు (శనివారం) అండమాన్ సమీపంలో ఇది అల్పపీడనంగా మారే అవకాశముంది. ఇది క్రమేపి వాయుగుండగా మారుతుందని, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశముందని తెలుస్తోంది. వాయుగుండంగా మారాక తీరం సమీపించే కొద్ది ఏపీ పైన ప్రభావం పడనుంది.
Comments
English summary
After Nada, another Cyclone to hit Andhra Pradesh.
Story first published: Friday, December 2, 2016, 19:21 [IST]