కొత్త.. ఎలా ఉంది, పట్టు పెంచుకో: అఖిలప్రియకు చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి అఖిల ప్రియ మంగళవారం నాడు భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఆమె చంద్రబాబును కలిశారు. పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో చంద్రబాబు సమావేశం కాగా.. ఆమె హాజరయ్యారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంత్రి అఖిల ప్రియ మంగళవారం నాడు భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఆమె చంద్రబాబును కలిశారు. పర్యాటక రంగ ప్రగతిపై అధికారులతో చంద్రబాబు సమావేశం కాగా.. ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టుల ప్రతిపాదనలు, ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు అఢిగి తెలుసుకున్నారు. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో 2020 నాటికి దేశంలోనే మూడో స్థానానికి ఏపీ చేరుకుంటుందన్నారు.
ట్విస్ట్.. నంద్యాలపై సుజన ఫోకస్: శిల్పా ధీమా, అఖిలప్రియ యూటర్న్?
ఆ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అనంతరం 2029 నాటికి తొలి స్థానానికి చేరుకోవాలన్నారు.
ఈ సందర్భంగా.. పర్యాటక మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలా ఉందని అఖిలను చంద్రబాబు అడిగారు. శాఖపై పట్టు పెంచుకోవాలని సూచించారు. కాగా, నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిత్వంపై వారు చర్చించనున్నారు.