మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అఖిలప్రియ: తొలి సంతకం దానిపైనే!..
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పేద కళాకారులకు ఆర్థిక సహాయం చేసే ఫైల్ పై ఆమె తొలి సంతకం చేశారు.
అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో పర్యాటక శాఖ మంత్రిగా పదవి దక్కించుకున్న భూమా అఖిలప్రియ నేడు బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పేద కళాకారులకు ఆర్థిక సహాయం చేసే ఫైల్ పై ఆమె తొలి సంతకం చేశారు.
ఈ సందర్బంగా అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం నుంచి అరకు వరకు పర్యాటక రైలును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. టెంపుల్ టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. ఇదే సందర్బంగా ఏపీటీటీసీ యాప్ ను కూడా ఆమె ప్రారంభించారు.
కాగా, భూమా మరణం తర్వాత అఖిలప్రియ పట్ల సానుభూతి పెరిగిపోవడంతో టీడీపీ ఆమెను మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తండ్రి మరణించిన మరుసటి రోజే ఆమెను అసెంబ్లీకి తీసుకురావడం పట్ల కూడా టీడీపీ విమర్శలు ఎదుర్కొంది. గతంలో అనుభవం లేకపోయినా.. అనుభజ్ఞులైన టీడీపీ నాయకుల సహాయంతో మంత్రి పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని అఖిలప్రియ చెబుతున్నారు.