‘మావోయిస్టుల నుంచి చంద్రబాబుకు ముప్పు’
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న వారి జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఉన్నారని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. సీఎంతోపాటు చాలామంది పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా ముప్పు ఉందని చ
విశాఖపట్నం: మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న వారి జాబితాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఉన్నారని ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. సీఎంతోపాటు చాలామంది పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా ముప్పు ఉందని చెప్పారు.
శుక్రవారం ఆయన నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వచ్చారు. తన వైద్య మిత్రులు ఇందులో విధులు నిర్వర్తిస్తున్నారని.. ఆసుపత్రి వారు ఆహ్వానించడంతో వచ్చానన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని హెలీకాప్టర్లో తీసుకొచ్చి నేరుగా ఆసుపత్రిపైనే దిగేలా హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేశారని, అది తమ పోలీసుశాఖకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. గత అక్టోబర్లో ఏవోబీలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయాక.. పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు మావోలకు లక్ష్యంగా మారారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.