జానాతో బాబు షేక్ హ్యాండ్: పార్లమెంట్లో అల్లూరి విగ్రహాం (ఫోటోలు)
హైదరాబాద్: పార్లమెంట్ ఆవరణలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం త్వరలో ఏర్పాటు చేయించనున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం అల్లూరి 118వ జయంతిని పురస్కరించుకుని ట్యాంక్బండ్పై ఆయన విగ్రహం వద్ద ఏపీ సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమం లో చంద్రబాబు పాల్గొని నివాళులర్పించారు.
అల్లూరి విగ్రహానికి నివాళులర్పించేందుకు వచ్చిన సమయంలో తెలంగాణ శాసనసభ ప్రతిపక్షనేత జానా రెడ్డి కూడా అక్కడికి వచ్చారు. దీంతో వారిద్దరూ కరచాలనం చేసుకున్నారు. అనంతరం పరస్పరం పలకరించుకున్నారు.
ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజలకే కాకుండా దేశం మొత్తానికి అల్లూరి స్ఫూర్తి అని కొనియాడారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు దివంగత ఎర్రన్నాయుడు ఎంపీగా ఉన్నప్పుడే ప్రతిపాదనలు పంపామని, అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యమైందని చెప్పారు.
జానాతో బాబు షేక్ హ్యాండ్: పార్లమెంట్లో అల్లూరి విగ్రహాం
ప్రస్తుత లోక్సభ స్పీకర్ దృష్టికి మరోసారి ఈ విషయాన్ని తీసుకెళ్లి అల్లూరి సీతారామరాజు విగ్రహన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.
జానాతో బాబు షేక్ హ్యాండ్: పార్లమెంట్లో అల్లూరి విగ్రహాం
విగ్రహాన్ని ఏపీ ప్రభుత్వమే సమకూరుస్తుందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో అల్లారి పేరిట గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
జానాతో బాబు షేక్ హ్యాండ్: పార్లమెంట్లో అల్లూరి విగ్రహాం
దీంతో పాటు గతేడాది తమ ప్రభుత్వం ప్రకటించిన విధంగా అల్లూరి పేరుతో ఏపీలో రూ. 20 కోట్లతో 90 ఎకరాల్లో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జానాతో బాబు షేక్ హ్యాండ్: పార్లమెంట్లో అల్లూరి విగ్రహాం
ఈ కార్యక్రమంలో ఏపీ సాంఘిక సంక్షే మ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు, టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, మాగంటి గోపీనాథ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.