వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిపై సింగపూర్ ప్లాన్:మార్చాలని బాబు, ఇలా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని ప్రణాళికలో స్వల్ప మార్పులు చేయాలని సింగపూర్ ప్రభుత్వానికి సూచించారు. రాజధాని ప్రధాన ప్రాంతాన్ని మిగతా నగరాలతో కలుపుతూ రోడ్లు నిర్మించాలని చంద్రబాబు సూచించారు.

ఈ మార్పులతో మరోసారి ప్రణాళిక రూపొందించనున్నట్లు సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు సింగపూర్‌ ప్రతినిధులు ఏపీ రాజధాని ప్రణాళికను చంద్రబాబుకు అందజేశారు. ఈ ప్రణాళికను పరిశీలించిన చంద్రబాబు కొన్ని మార్పులు చేర్పులు చేసి, 8 వారాల్లోగా పూర్తి చేయాలని సూచించారు.

AP CM N Chandrababu Naidu leaves for Singapore

రాజధాని ప్రాంతంలో రెండు రింగ్‌ రోడ్లు నిర్మించి, కోర్‌ క్యాపిటల్‌కు అనుసంధానం చేయాలని చంద్రబాబు కోరారు. రేడియల్‌ రోడ్లు నిర్మించాలని కోరారు. రాజధాని ప్రణాళిక, ల్యాండ్‌పూలింగ్‌, కృష్ణానదిపై వంతెన నిర్మాణం, ల్యాండ్‌ పూలింగ్‌పై ఏపీ అధికారులు సింగపూర్‌ బృందానికి ప్రజంటేషన్‌ ఇచ్చారు.

చంద్రబాబు నేతృత్వంలోని బృందం సింగపూర్‌లో పర్యటిస్తోంది. సింగపూర్‌ ప్రభుత్వంతో భేటీ అయిన చంద్రబాబు బృందం సీఆర్డీఏ అభివృద్ధి, రాజధాని ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. దానికంటే ముందు సింగపూర్‌ మంత్రి షణ్ముగం, రాయబాలి పిళ్లైతో అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం సింగపూర్‌ పారిశ్రామిక మంత్రి ఈశ్వరన్‌తో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

English summary
AP CM N Chandrababu Naidu leaves for Singapore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X