రాజధానిలోనే తాత్కాలిక సచివాలయం: 180కోట్లతో 10 అంతస్తుల్లో నిర్మాణం?
అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయాన్ని రాజధాని అమరావతి పరిధిలోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.180 కోట్లను వెచ్చిస్తోంది. ఇది తాత్కాలిక వసతైనప్పటికీ రాజధాని పరిధిలోనే నిర్మిస్తే భవిష్యత్తు అవసరాలకు పనికొస్తుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రాజధాని పరిధిలోని ఐదు ప్రాంతాల నుంచి మట్టి నమూనాలను సేకరించి, శనివారం పరీక్షలు ప్రారంభించారు. ఏ ప్రాంతాన్ని ఎంపిక చేశారనేదానిపై ఐదారు రోజుల్లో స్పష్టత వస్తుందని సమాచారం.

తాత్కాలిక సచివాలయం ఆంగ్లాక్షరం ‘సి' ఆకారంలో, ఎనిమిది లేదా పది అంతస్తులుగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరు లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మిస్తే అన్ని విధాలుగా బాగుంటుందని సీఆర్డీఏ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది.
కాగా, ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు జి+2 లేదా జి+3 వరకు సత్వరం నిర్మిస్తారు. తర్వాత మిగతా అంతస్తులను కడతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లోనే ఏపి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !!












Click it and Unblock the Notifications